అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం
from జైకిసాన్ https://ift.tt/il5XEVt
సెంటు భూమిలేని కౌలు రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఎన్ని కొత్త చట్టాలు చేసినా భూయజమానులతో సమానంగా పంట రుణాలు సహా ఉత్పాదకాలు అందకపోతుండడంతో లక్షలాదిమంది కౌలుదార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
వ్యవసాయంపై శ్రద్ధ పెట్టకుండా రైతు సంక్షేమం ఎలా వెల్లివిరిస్తుంది..? చేయూతనిస్తేనే సేద్యంపై రైతులకు భరోసా పెరుగుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మార్చి 2022 సంచిక ప్రచురించింది.
రసాయనాల విచ్చలవిడి వాడకంతో నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి. సేంద్రియ సేద్యంలో రాణిస్తున్న పలువురు రైతుల అనుభవాలు, భూభౌతిక పరిస్థితులను మెరుగు పర్చాల్సిన అవసరంపై నేను రాసిన వ్యాసం అన్నదాత మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది.
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను కుప్ప కూల్చిన ఈ రెండేళ్లలో భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలిచింది వ్యవసాయరంగమే. కానీ కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు కూడా కేంద్రానికి మనసొప్పకపోవడం దురదృష్టం. సాగుదార్లకు తీవ్ర నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్ పై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.