Friday, 8 November 2013

పంట చేలో ఒంటరి దిష్టిబొమ్మ

ఇటీవల నేను రాసిన పంట చేలో ఒంటరి దిష్టిబొమ్మ కవిత ఈ నెల తెలుగు వెలుగు పత్రికలో (46వ పేజీ) ప్రచురితమైంది. మీ కోసం ఇక్కడ కవితను అప్ లోడ్ చేస్తున్నాను.  
                                                                                  

Saturday, 2 November 2013

శుభాలనిలిచ్చే వెలుగుల పండగ

దీపావళి అందరి పండగ. దివ్వెలు వెలిగించి ప్రేమలు పంచుకునే ఈ పర్వదినాన ప్రతి ఒక్కరి ఇంటా ఆనంద జ్యోతులు వెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
                                                                           

Wednesday, 30 October 2013

పంట చేలల్లో కన్నీటి మంటలు

 
విపత్తులు ఉరుముతున్నప్పుడల్లా  రాష్ట్ర రైతులు చిగురుటాకులా కంపించిపోతున్నాడు. ఏటా ఉత్పాతాలు విరుచుకుపడిన ప్రతిసారీ పంటలు ధ్వంసమై రైతులు చితికిపోతుండటం పరిపాటిగా మారుతోంది. గడచిన పదేళ్ళలో నాలుగు పంటలే దక్కాయి. నష్టం జరిగిన ప్రతిసారీ పాలకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చిటికిన బతుకులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టడం లేదు. విపత్తుల విషయంలో ప్రకృతి కంటే ప్రభుత్వమే రైతుల్ని ఎక్కువగా గాయపరుస్తోందంటూ నేను రాసిన వ్యాసాన్ని  ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                             

Sunday, 8 September 2013

శరణం శ్రీ గణేశం

                                                                             
                    
                                         శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
                                       ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!

           భాద్రపద శుద్ధ  చవితి రోజు నిద్ర లేచి ప్రాతః కాలంలో పత్రి సేకరణ కోసం పొలాలు, తోటల్లోకి వెళ్లి పెద్ద కాలువలో ఈతలు కొట్టి రావడం..., స్నానాదులు ముగించి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం... , కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని ప్రతిష్టించి నిష్టగా పూజ చేయడం.., చిన్నతనంలో అన్ని పూజల కంటే ఈ వినాయకుని పూజలోనే ఎక్కువగా పాల్గొనటం.., ముఖ్యంగా శ్రీ వినాయక వ్రత కధను నేనే చదవటం బాగా అలవాటు. కధ చదవటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా కాలక్రమంలో పత్రిని కొనుగోలు చేసి తీసుకురావటం మాత్రం అలవాటైంది. గణపతి నవరాత్రుల కాలంలో హైదరాబాద్ లో ఈ పండగ సంబరాలు జరిగే తీరు నభూతో నభవిష్యతి! ఈ  ఏడాది కూడా ఎప్పటిలా శాంతి సామరస్యాలతో వినాయక ఉత్సవాలు జరగాలని కోరుకుంటూ మిత్రులు, హితులు,సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరునా వినాయక చవితి శుభాకాంక్షలు.
                                            సర్వేజనా సుఖినోభవంతు.

Friday, 6 September 2013

రైతు శ్రేయం తోనే ఆహార భద్రత!

దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్రం గొప్ప ముందడుగు వేయడం సంతోషించదగిన విషయమే. కానీ ఆహార భద్రత కల్పించే క్రమంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను కేంద్రం ఉపెక్షిస్తుండటమే విచారకరం. దేశంలో తిండి గింజలు పండించే రైతులే ఒక పూట తిండికి నోచుకోలేక పోతున్నారు. వారి సంక్షేమం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా., రెట్టింపు దిగుబడులు సాధించాలంటే రైతుకు ఏ విధంగా చేయూత నివ్వాలనే అంశాలను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఆహార భద్రత సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుకు భద్రత కల్పిస్తేనే ఆహార భద్రత సుసాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                              

Friday, 5 July 2013

రైతుకు తోడ్పాటేదీ..!

ఏటా వ్యవసాయ కార్యాచరణ కాగితాల్లోనే కనిపిస్తోంది తప్ప పంట దిగుబడుల్ని పెంచేందుకు,  రైతుల్ని ప్రోత్సహించేందుకు సర్కారు చిత్తశుద్దిని చూపటం లేదు. ఏటికేడూ లక్ష్యాలు ఘనంగానే కనిపిస్తున్న వాటిని సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి బొత్తిగా శూన్యం. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, సాగునీరు వంటి పంట ఉత్పాదకాలు అందటం ఎంత ముఖ్యమో సాంకేతికతను ఉపయోగించి మెరుగైన దిగుబడులు సాదించేలా రైతులకు సాగు విధానాల్లో సలహాలు అందించడం అంటే ప్రధానం. ఇవన్నీ విస్మరిస్తున్న కారణంగా అధికోత్పత్తులు సాధించడంలో ఆశించిన పురోగతి సాధ్య పడటం లేదు. ఇప్పటికైనా సాగు చేస్తున్న రైతులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలు చూపగలిగితే మన రైతులు అధ్బుత దిగుబడులు సాధించడంలో ప్రపంచంలో ఎవరికీ తీసిపోరనటంలో  సందేహం లేదు. ఎటొచ్చీ సర్కారు చిత్తశుద్ది పైనే సందేహమంతా...!
                                                               

Sunday, 30 June 2013

"శివగీతార్చన" ఆడియో సీడీ విడుదల

నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన"  పాటల సీడీని విడుదల చేశాక రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో, మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన "శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని మిగిల్చాయి.