Saturday 2 January 2016

కర్షకరత్న పురస్కారం

కర్షకరత్న పురస్కారం
                                                           



మియాపూర్‌ ధర్మపురి క్షేత్ర ట్రస్టు బోర్డు వారు ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజున నాకు '' కర్షక రత్న'' పురస్కారం అందించారు. రెండు దశాబ్దాలుగా ఈనాడు ఈటీవీ ద్వారా రైతు ప్రయోజనాల కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్టు నిర్వాహకులు తెలిపారు. నాతో పాటు వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అన్నదాత సంపాదకులు వాసిరెడ్డి నారాయణరావు, రైతునేస్తం పత్రిక ఎడిటర్‌ వేంకటేశ్వరరావులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.