వ్యవసాయ పరిశోధనలు మందగించడం, విస్తరణ సేవలు రైతులకు అందకపోవడంతో పంటల సాగులో రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
ఏటా సీజన్ కు ముందు నకిలీ, నాసిరకం విత్తనాలతో ఎందరో రైతులు పెట్టుబడులతో పాటు ఒక్కోసారి సర్వస్వం కోల్పోవాల్సి వస్తోంది. రైతు సంఘాల స్థాయిలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలిగితే విత్తన సమస్యను చాలా వరకు నివారించవచ్చు. వీటి ఏర్పాటుకున్న అవకాశాల గురించి నేను రాసిన వ్యాసం ఫిబ్రవరి "అన్నదాత" మాసపత్రికలో ప్రచురితమైంది.