దేశవ్యాప్తంగా భూసారం క్షీణిస్తోంది. విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లేస్తున్న కారణంగా నేలల జీవం కోల్పోతున్నాయి. పంట మార్పిడి పాటించకపోవడం, భూతాపం తదితర కారణాలతో నేలలు ఇప్పటికే నిస్సారమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో భాస్వరం, జింక్, బోరాన్, మాంగనీస్, ఇనుము లోపాలు తీవ్రంగా ఉన్నాయి. వీటిని సరిచేసే చర్యలు చేపట్టకుండా ఇలానే సేద్యం సాగిస్తూ పోతే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత దారుణంగా పడిపోతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/2Wxj4qY