అన్నదాత మాసపత్రిక జూలై 2021 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం.
from జైకిసాన్ https://ift.tt/3he0OQV
మన నేలలు పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతున్నాయి. విచ్చలవిడి రసాయనాల వాడకంతో నేలలకు పట్టిన దుర్గతి ఇది. రసాయనాలతో నేలలోని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించడంతో వాటిని పంటలకు లభ్యమయ్యే రూపంలోకి తీసుకురాలేకపోతున్నాయి. ఫలితంగా నిస్సారమైన నేలల్లో పండించిన పంట ఇలా పోషకాలు లేకుండా ఉత్పత్తవుతోంది. ఇందుకు భూమిలో సేంద్రియ కర్భనాన్ని గణనీయంగా పెంచేందుకు సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాల ఆచరణతో పాటు పలు పరిష్కారాలను సూచించిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. అన్ని రకాల ధరలూ పెరిగాయి. కరోనా రెండో దశ ఇంకా సమసిపోలేదు. మూడో దశ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో సాగు ప్రతి దశలో రైతులు ఖర్చు తగ్గించుకునే చర్యలను చేపట్టడం అత్యంత అవశ్యం. ముఖ్యంగా డిఏపి మినహాఎరువుల ధరల దాదాపు రెట్టింపయిన నేపథ్యంలో రైతులు ఇష్టానుసారం ఎరువులు వాడకుండా సిఫారసు మేరకు చల్లడంతో పాటు సేంద్రియ వ్యవసాయ విధానాలను ఆచరించి ఖర్చు తగ్గించుకోగలిగితేనే మిగులుబాటు ఉంటుందంటూ నేను రాసిన వ్యాసం " అన్నదాత" మాసపత్రిక జూన్ 2021 సంచికలో ప్రచురితమైంది.