గతంలో అరటి చెట్టును గెలలు కోశాక బోదెల్ని పారవేసేవారు. అవన్నీ వ్యర్ధాలుగా మిగిలిపోయేవి. ఒక దశాబ్ద కాలంగా అరటి బోదెల్ని ఉపయోగించి ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసే వారికి సాంకేతికంగా ఎంతో సహాయం అందిస్తోంది. యువతరంతో పాటు స్వయం సహాయక బృందాల మహిళలు, రైతులు అదనపు అదాయం కోసం వీటిని ఏర్పాటు చేసుకుని లాభపడ వచ్చనే సమాచారంతో ఈ నెల అన్నదాతలో ఒక వ్యాసం రాశాను.
from జైకిసాన్ https://ift.tt/2um4uX6