ఇజ్రాయెల్ వ్యవసాయంపై తెలుగులో తొలి పుస్తకం "ఎడారిలో ఒయాసిస్సు" ఆగస్టులో ఆవిష్కరించాక కేవలం రెండు నెలల్లోనే తొలి ఎడిషన్ పుస్తకాలు అయిపోయాయి. రెండో ముద్రణ కూడా అచ్చు వేయించాను. ఈ కవర్ పేజీ ద్వితీయ ముద్రణదే. అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. విజయవాడ బుక్ ఫెయిర్ లోనూ ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో రైతుల ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్ధ తాజా నివేదిక విడుదలైన నేపథ్యంలో రైతులు బలవన్మారణాలకు కారణాలు, కొన్ని పరిష్కారాలపై నేను రాసిన వ్యాసం డిసెంబరు నెల "అన్నదాత" లో ప్రచురితమైంది.
రైతులకు ఆసరాగా ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని అమలు చేయాలంటూ గత పదేళ్లుగా నా వాణి వినిపిస్తున్నా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజాపా ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అభినందనీయం. దీనిపై అన్నదాత అక్టోబరు'19 సంచికలో నా వ్యాసం.
ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఈ మహనీయిడి నుంచి విశ్వ మానవాళి ఎంతో కొంత నేర్చుకుంది. గాంధీజీ పుట్టిన ఈ దేశం మాత్రం ఆయన నడచిన బాటలో ముందుకు సాగటంలో తడబడుతోంది. మహాత్ముని 150వ జయంతి శుభాకాంక్షలు. బాపు కు ఈటీవీ భారత్ ఘన నివాళి ఇది.
కేవలం పంటల సాగునే నమ్ముకోకుండా పంటతో పాటు పశుపోషణ, చేపలు, కోళ్లు, జీవాలు, తేనెటీగలు, పట్టు పురుగులు, పుట్టగొడుగుల పెంపకాన్ని పరిమిత స్థాయిలో చేపడితే రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో సేద్యంలో నష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి సమగ్ర వ్యవసాయ విధానం రైతుల ఆదాయానికి భరోసాగా ఉంటుందంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక సెప్టెంబరు సంచికలో చూడవచ్చు.