Monday 16 February 2015

శంభో శంకర

                                                      హరహర మహాదేవ శంభో శంకర
                                                                 

Tuesday 10 February 2015

కేజ్రీవాల్ సునామీ !

                                                                                 
 
దిల్లీ ఎన్నికల్లో సామాన్యుడిదే విజయం. హస్తిన కురుక్షేత్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 70 సీట్లలో 67 స్థానాలు వూడ్చేసిందంటే అది మామూలు సునామీ కాదు. పాపం కమలనాధుల గర్వం మొత్తం అణిగిపోయేలా దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రకు నాందిగా చెప్పవచ్చు. బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదనుకుంటే., కాంగ్రెస్ పరిస్థితి గుండు సున్నా. ఏదేమైనా కేజ్రీవాల్ పోయిన చోట వెతుక్కుంటే., బీజేపీ, కాంగ్రెస్ లు బిక్క చచ్చిపోయాయి. మొత్తంగా  ప్రజలు తలుచుకుంటే మార్పును ఎలా తీసుకురాగలరో ప్రతి పార్టీకి, రాజకీయనాయకులకు కళ్ళు తెరుచుకునేలా దిల్లీ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.   

Wednesday 4 February 2015

నా తొలి కవితా గోష్టి తీపి గురుతులు

                                                                             

జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1989 లో నేను తొలిసారిగా  గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక కవితా గోష్టిలో పాల్గొన్నాను. రేపల్లె ఎబీఆర్ కాలేజీ లో చదువుతున్నప్పుడు వ్యాసరచన, వ్యకృత్వం, క్విజ్, డిబేట్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో బహుమతులు సాధించాను. నేను నా మిత్రులు మూడేళ్ళలో కనీసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు డజన్లకు పైగా కప్పులు, షీల్డులు గెల్చుకొచ్చాం.   మా కళాశాల ప్రిన్సిపాల్ కేజేసీ హరివిటల్ గారు నాకూ  నా సహచరులు కుమార్, రావెళ్ళ లకు నేలకోసారన్నా అభినందన సభలు పెట్టేవారు. పేపర్లలో ఈ వార్తలు తరచుగా చూసిన  సాహితీ భారతి  అనే సంస్థ వారు రేపల్లె పట్టణంలో 14-11-89 న నిర్వహించిన కవితా గోష్టికి నన్ను ఆహ్వానించారు.  ఎందుకో ఈ మధ్య నా పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఫైల్ చూస్తుంటే  ఈ కరపత్రం నిపించింది.  ఎన్నో జ్ఞాపకాలు  నన్ను ముంచెత్తాయి. నాతో పాటు ఈ గోష్టిలో పాల్గొన్న వారిలో "అహనా పెళ్ళంట" సినిమాలో ఒకే ఒక్క పాట రాసిన (కస్తూరి రంగయ్యా కరుణించవేమయ్యా..) శాస్త్రి గారు కూడా ఉన్నారు.