జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1989 లో నేను తొలిసారిగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక కవితా గోష్టిలో పాల్గొన్నాను. రేపల్లె ఎబీఆర్ కాలేజీ లో చదువుతున్నప్పుడు వ్యాసరచన, వ్యకృత్వం, క్విజ్, డిబేట్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో బహుమతులు సాధించాను. నేను నా మిత్రులు మూడేళ్ళలో కనీసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు డజన్లకు పైగా కప్పులు, షీల్డులు గెల్చుకొచ్చాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కేజేసీ హరివిటల్ గారు నాకూ నా సహచరులు కుమార్, రావెళ్ళ లకు నేలకోసారన్నా అభినందన సభలు పెట్టేవారు. పేపర్లలో ఈ వార్తలు తరచుగా చూసిన సాహితీ భారతి అనే సంస్థ వారు రేపల్లె పట్టణంలో 14-11-89 న నిర్వహించిన కవితా గోష్టికి నన్ను ఆహ్వానించారు. ఎందుకో ఈ మధ్య నా పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఫైల్ చూస్తుంటే ఈ కరపత్రం నిపించింది. ఎన్నో జ్ఞాపకాలు నన్ను ముంచెత్తాయి. నాతో పాటు ఈ గోష్టిలో పాల్గొన్న వారిలో "అహనా పెళ్ళంట" సినిమాలో ఒకే ఒక్క పాట రాసిన (కస్తూరి రంగయ్యా కరుణించవేమయ్యా..) శాస్త్రి గారు కూడా ఉన్నారు.
Wednesday 4 February 2015
నా తొలి కవితా గోష్టి తీపి గురుతులు
జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1989 లో నేను తొలిసారిగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక కవితా గోష్టిలో పాల్గొన్నాను. రేపల్లె ఎబీఆర్ కాలేజీ లో చదువుతున్నప్పుడు వ్యాసరచన, వ్యకృత్వం, క్విజ్, డిబేట్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో బహుమతులు సాధించాను. నేను నా మిత్రులు మూడేళ్ళలో కనీసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు డజన్లకు పైగా కప్పులు, షీల్డులు గెల్చుకొచ్చాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కేజేసీ హరివిటల్ గారు నాకూ నా సహచరులు కుమార్, రావెళ్ళ లకు నేలకోసారన్నా అభినందన సభలు పెట్టేవారు. పేపర్లలో ఈ వార్తలు తరచుగా చూసిన సాహితీ భారతి అనే సంస్థ వారు రేపల్లె పట్టణంలో 14-11-89 న నిర్వహించిన కవితా గోష్టికి నన్ను ఆహ్వానించారు. ఎందుకో ఈ మధ్య నా పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఫైల్ చూస్తుంటే ఈ కరపత్రం నిపించింది. ఎన్నో జ్ఞాపకాలు నన్ను ముంచెత్తాయి. నాతో పాటు ఈ గోష్టిలో పాల్గొన్న వారిలో "అహనా పెళ్ళంట" సినిమాలో ఒకే ఒక్క పాట రాసిన (కస్తూరి రంగయ్యా కరుణించవేమయ్యా..) శాస్త్రి గారు కూడా ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment