Tuesday 10 February 2015

కేజ్రీవాల్ సునామీ !

                                                                                 
 
దిల్లీ ఎన్నికల్లో సామాన్యుడిదే విజయం. హస్తిన కురుక్షేత్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 70 సీట్లలో 67 స్థానాలు వూడ్చేసిందంటే అది మామూలు సునామీ కాదు. పాపం కమలనాధుల గర్వం మొత్తం అణిగిపోయేలా దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రకు నాందిగా చెప్పవచ్చు. బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదనుకుంటే., కాంగ్రెస్ పరిస్థితి గుండు సున్నా. ఏదేమైనా కేజ్రీవాల్ పోయిన చోట వెతుక్కుంటే., బీజేపీ, కాంగ్రెస్ లు బిక్క చచ్చిపోయాయి. మొత్తంగా  ప్రజలు తలుచుకుంటే మార్పును ఎలా తీసుకురాగలరో ప్రతి పార్టీకి, రాజకీయనాయకులకు కళ్ళు తెరుచుకునేలా దిల్లీ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.   

No comments: