ఏళ్ళు గడుస్తున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆహారభద్రత గురించి
గొంతు చించుకుంటున్న యూపీఏ ప్రభుత్వం దీనికి మూలమైన వ్యవసాయ రంగ
అభివృద్ధిని విస్మరిస్తోంది. సాగులో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాలంటే
రైతుకు చేయూత అవసరం. అందుకు తగిన సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. ఇవేమీ
చేయకుండానే వ్యవసాయం బాగున్నట్టు ఆహార భద్రత కల్పించేస్తామంటూ కేంద్రం
ప్రజల్ని మభ్య పెడుతోంది. దశాభ్దాలుగా సేద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతుల పరిస్థితి దిగజారింది. ముందు రైతుల్ని నిలబెట్టే చర్యలకు ఉపక్రమించకుండా బడ్జెట్లలో
కేంద్రం వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపుతూ వచ్చింది. 28న కేంద్రం ప్రవేశ
పెట్టనున్న సాధారణ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండాలి ? రైతుల పరిస్థితి
మెరుగు పడాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
No comments:
Post a Comment