నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన" పాటల సీడీని విడుదల చేశాక
రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది
శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన
మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో,
మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన
"శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం
జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు
వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని
మిగిల్చాయి.
No comments:
Post a Comment