Wednesday, 24 December 2014

భారత రత్నాలు




దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్ పేయికి, పండిట్ మదన్ మోహన్ మాలవ్య లకు భారత అత్యున్నత పురస్కారం " భారతరత్న" ప్రకటించడం మనల్ని మనం గౌరవించుకోవడమే. 31 ఏళ్ళకే పార్లమెంటు సభ్యుడై దేశసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన  అజాత శత్రువు ఆయన.  అగ్రరాజ్యాల బెదిరింపులకు భయపడకుండా అణుపరీక్షలు నిర్వహించడంలో, దేశ రక్షణ విషయంలో రాజీపడకుండా వ్యవహరించడంలో ఆయన చూపిన సమర్ధ నాయకత్వం ప్రశంసనీయం, 3 సార్లు ప్రధానిగా వ్యవహరించిన అటల్ జీ ఎన్నో విప్లవాత్మక చర్యలతో సమర్ధ ప్రధానిగా సుస్థిర పాలనను అందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకునిగా పేరు పొందిన మదన్ మోహన్ మాలవ్య సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. దేశానికి స్వాతంత్ర్యం లభించటానికి ఏడాది ముందే తనువు చాలించిన ఈ మహామేధావికి భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచితం.  వీరిరువురూ భారతరత్నాలే.


   

Tuesday, 23 December 2014

అపరాల రైతుకు ఆదరువేదీ?

హరిత విప్లవానంతరం సారవంతమైన నేలల నుంచి వర్షాధారపు భూములకు మళ్ళించాక దేశంలో పప్పుదాన్యాల సాగు, సాగుదార్ల  పరిస్థితి దయనీయంగా  మారింది. దశాబ్దాలు గడుస్తున్నా విస్తీర్ణం, ఉత్పత్తి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని విశ్లేషిస్తే., రెండు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకటి.. దేశ ప్రజల్లో  పోషక విలువలు తగ్గిపోవడం, రెండోది ఈ పంటలు సాగు చేసే రైతులు అప్పులపాలవటం... దేశంలో ఈ పంటల సాగు వృద్ధి చెందకపోవడానికి దారితీసిన పరిస్థితులు, దిగుబడులు పెంచేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం నా వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                         

దర్శక శిఖరం బాలచందర్

                                                                         

ఒక మరోచరిత్ర, ఒక అంతులేని కథ.., ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్... సెల్యులాయిడ్ సంచలనాలైన ఇటువంటి కళాఖండాలను ఇక చూడలేము., వెండితెర వెలిగినన్నాళ్ళూ చిరస్థాయిగా నిలిచే సినిమాలు తెరకెక్కించటమేగాక, జాతి గర్వించే మేటి నటుల్ని అందించిన దర్శక శిఖరం బాలచందర్ ఇక లేరనే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ... 

Monday, 8 December 2014

ఊరూరా జీవధారలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జీవనాధారమైన వేలాది చెరువులు నేడు ధ్వంసమయ్యాయి. కాకతీయుల కాలం నుంచి చెరువుల చుట్టూ పెనవేసుకున్న ప్రజల జీవితాలను ఈ చెరువుల విధ్వంసం  ఆ తర్వాత కాలంలో తీవ్రంగా ప్రభావితం చేసింది. కెసీఆర్ ప్రభుత్వం "మిషన్ కాకతీయ" పేరుతొ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపడుతోంది. చెరువుల పునరుద్ధరణ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంలా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు తెలంగాణ ఎడిషన్ ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.