Wednesday 24 December 2014

భారత రత్నాలు




దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్ పేయికి, పండిట్ మదన్ మోహన్ మాలవ్య లకు భారత అత్యున్నత పురస్కారం " భారతరత్న" ప్రకటించడం మనల్ని మనం గౌరవించుకోవడమే. 31 ఏళ్ళకే పార్లమెంటు సభ్యుడై దేశసేవ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన  అజాత శత్రువు ఆయన.  అగ్రరాజ్యాల బెదిరింపులకు భయపడకుండా అణుపరీక్షలు నిర్వహించడంలో, దేశ రక్షణ విషయంలో రాజీపడకుండా వ్యవహరించడంలో ఆయన చూపిన సమర్ధ నాయకత్వం ప్రశంసనీయం, 3 సార్లు ప్రధానిగా వ్యవహరించిన అటల్ జీ ఎన్నో విప్లవాత్మక చర్యలతో సమర్ధ ప్రధానిగా సుస్థిర పాలనను అందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకునిగా పేరు పొందిన మదన్ మోహన్ మాలవ్య సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. దేశానికి స్వాతంత్ర్యం లభించటానికి ఏడాది ముందే తనువు చాలించిన ఈ మహామేధావికి భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచితం.  వీరిరువురూ భారతరత్నాలే.


   

No comments: