Thursday 31 December 2015

కర్షకరత్న పురస్కారం

మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం 9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


from జైకిసాన్ http://ift.tt/1RSKFha

No comments: