ఏటా మే 15 వ తేదీని రైతుల హక్కుల దినోత్సవం గా పాటించాలని రైతు విత్తన హక్కుల పరిరక్షణ వేదిక, రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్తంగా పిలుపునిచ్చాయి. రైతులు, రైతు సంఘాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వం దీన్ని పాటించాలని అవి కోరాయి. రైతులు పూర్తిగా హక్కులు కోల్పోతున్న నేపధ్యంలో
సేద్యంలో రైతులు తీసుకునే అన్ని నిర్నయాలకూ మూలమైన విత్తన హక్కులు కీలకమని భావించి రైతు విత్తన హక్కుల వేదికను
yఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు,
డాక్టర్ కే.ఆర్. చౌదరి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు.
రైతుల సేద్య హక్కుల పరిరక్షణ., ముఖ్యంగా పంట, విత్తన రకాల ఎంపిక.,
కలిసి వచ్చే సంస్థలు, వర్గాలు, నిపుణుల మధ్య సమన్వయంతో హక్కుల
పరిరక్షణకు కృషి చేయడం., ఇందుకు అవసరమైన ప్రచురణలు, చర్చలు నిర్వహించడం.,
లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం., రైతులు,
సమాజం విశాల ప్రయోజనాలను
దృష్టిలో పెట్టుకొని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని వారంటున్నారు.
వీరి కృషి ఫలించాలని కోరుకుందాం. గురువారం ఈనాడులో నన్ను
కలిసిన ప్రసాదరావు గారికి పూర్తి స్థాయిలో నా సహకారం అందిస్తానని
హామీ ఇచ్చాను. మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.
No comments:
Post a Comment