డాలరుతో బక్క చిక్కిన రూపాయి రైతుకు మరింత భారాన్ని పెంచింది. రాయితీ భారాన్ని మోసేందుకు కేంద్రం
నిరాకరించడాన్ని
సాకుగా చూపి ఎరువుల కంపెనీలు ధరల్ని ఇష్టానుసారం పెంచేశాయి. గత నెలలో
ఐపీఎల్ కంపెనీ పోటాష్ ధరల్నిభారీగా పెంచితే., నేడు
కోరమాండల్ కంపెనీ పోటాష్, కాంప్లెక్స్ ఎరువుల
ధరలను పెంచుతున్నట్టు వ్యవసాయశాఖకు తెలిపింది. మరి కొద్ది రోజుల్లో సీజన్ కు సన్నద్దమవుతున్న రైతుకు ఇది
నిజంగా పిడుగుపాటే. తాజాగా పెరిగిన ధరలతో రైతులపై రూ. 436 కోట్ల దాకా
అదనపు భారం పడుతుంది. గత ఏడాది కాలంలో 17
సార్లు ఎరువుల ధరలు పెంచిన కంపెనీలను ప్రభుత్వం
నియంత్రించ లేకపోవడంతో రైతుకు పెట్టుబడులు మరింత భారంగా పరిణమించాయి.
ఇప్పటికే వరుస నష్టాలతో సేద్యాన్ని అప్పులమయం చేసుకున్న రైతుల పరిస్థితిని
మరింత దిగజార్చేలా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం.
ఎరువుల ధరలపై నియంత్రణలను ఎత్తివేసాక కంపెనీలు
ఎడాపెడా ధరలు పెంచుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందే తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడం
లేదు.
రైతు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే కొద్దీ వ్యవసాయం దిగజారి., అంతిమంగా ఆర్ధిక వ్యవస్థనే దెబ్బ తీస్తుందని
తెలిసిన "ప్రపంచ ప్రముఖ ఆర్ధికవేత్త" మన్మోహన్
ఎన్నేళ్ళు ఇలా మౌనవ్రతం పాటిస్తారో కానీ అన్నదాతల్లో మాత్రం సహనం నశిస్తోంది.
No comments:
Post a Comment