వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ
మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు
వదల్లేదు. వరుస విపత్తులు రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని
అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు
ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల
బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న
అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త
నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని
మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
No comments:
Post a Comment