Monday 25 August 2014

ఈటీవికి "సనాతన హిందూ ధర్మ పురస్కారం"

సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, దేశ, విదేశాల్లోని అపురూప, పురాతన  దేవాలయాల గురించి కోట్లాది వీక్షకులకు అవగాహన కల్పిస్తున్న ఈటీవి "తీర్ధయాత్ర" కార్యక్రమాన్ని గుర్తించి తగురీతిలో గౌరవించింది అమెరికాకు చెందిన "గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ.  దేవాలయాల పరిరక్షణ గురించి ఈ నెల 22 నుంచి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చిత్ర ప్రదర్శన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి చేతుల మీదుగా నేను "సనాతన హిందూ ధర్మ రక్షక్ పురస్కారం" ను అందుకున్నాను. ఈ పురస్కారాన్ని అందించి గౌరవించిన ఫౌండేషన్ చైర్మన్ వెలగపూడి ప్రకాశరావు గారు, "గజల్ మ్యాస్ట్రో" ఆత్మీయ మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఈనాడు హైదరాబాద్ మినీ ఎడిషన్ లో వచ్చిన కవరేజీ క్లిప్పింగ్ ఇది.
                                                                             

                                                                     

No comments: